ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంలో విచారణ

రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకో్ర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్ […]

Written By: Suresh, Updated On : July 16, 2021 2:57 pm
Follow us on

రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరిగలేదంటూ ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకో్ర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ద్విసభ్య ధర్మాసనం.. రాష్ట్ర హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు ఇచ్చినట్లు తాము గమనించామని పేర్కొంది. ఈ అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు తమకు కనిపించడం లేదంటూ దుష్యంత్ దవే వాదనలతో విభేదించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.