
భారత్- చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహన్ని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. లాద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంట గతేడాది జూన 15న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబుతో పాటు మరికొందరు సైనికులు అమరులైన విషయం తెలిసిందే.