భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం

దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్ పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్ కెనడా, యూఏఈ, అమెరికా, ఇజ్రాయిల్ ప్రయాణాలపై నిషేధం విధించగా శ్రీలంక సైతం అదే బాట పట్టింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు ఆ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని సివిల్ ఏవియేషన్ అథారటీ తెలిపింది. నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. భారత్ లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Written By: Velishala Suresh, Updated On : May 6, 2021 12:26 pm
Follow us on

దేశంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్ పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బ్రిటన్ కెనడా, యూఏఈ, అమెరికా, ఇజ్రాయిల్ ప్రయాణాలపై నిషేధం విధించగా శ్రీలంక సైతం అదే బాట పట్టింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు ఆ దేశంలో దిగేందుకు అనుమతి ఇవ్వమని సివిల్ ఏవియేషన్ అథారటీ తెలిపింది. నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. భారత్ లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.