పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో రాజీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర పీసీసీ చీఫ్ గా సిద్ధూ బాధ్యతలు స్వీకరించగా ఈ కార్యక్రమానికి తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిసి కెప్టెన్ సింగ్ హాజరయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ లో విభేదాల పర్వానికి తెరదించాలన్న హైకమాండ్ ప్రయత్నాలు ఫలించాయి.