మాజీ ప్రధాని దేవెగౌడకు షాక్

మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ. 2 కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్ 28న గౌడర గర్జన పేరుతో ఓ కన్నడ ఛానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ఫ్రైజ్ ప్రాజెక్టు పై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. […]

Written By: Velishala Suresh, Updated On : June 22, 2021 2:28 pm
Follow us on

మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ. 2 కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్ 28న గౌడర గర్జన పేరుతో ఓ కన్నడ ఛానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ఫ్రైజ్ ప్రాజెక్టు పై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు.. ఎస్ఐసీఈ ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది.