
తాలిబన్లకు తొలి నుంచి మద్దతుగా నిలుస్తున్న పాక్ ప్రాధాని ఇమ్రాన్ ఖాన్ అఫ్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్టాన్ ప్రజల బానిస సంకెళ్లను తాలిబన్లు తెంచేశారని తాజాగా వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, పాశ్చాత్య సంస్కృతికి తలొగ్గడం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల సంస్కృతికి అలవాటు పడిన వారు మానసికంగా ఆ సంస్కృతికి తలొగ్గుతారు. ఇది బానిసత్వం కంటే దారుణమైదని మనం గుర్తించాలి. సాంస్కృతిక బానిసత్వ బంధనాలను తెెంచడం మరింత కష్టం. అయితే అఫ్టానిస్తాన్ లో ఈ సంకెళ్లు తెగిపోవడం మనం ప్రస్తుతం చూస్తున్నాం అని ఇమ్రాన్ ఖాన్ తాజాగా వ్యాఖ్యానించారు.