జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్ సమీపంలో ఉన్న ఓ పండ్ల తోటలో ఐదు కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు పదార్థాల నిల్వపై వచ్చిన పక్కా సమాచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందాలు తనిఖీలు నిర్వహించి, ఐదు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు.