కృష్ణా జలాలపై రోజా కీలక వ్యాఖ్యలు
కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి అక్రమంగా నీటి వినియోగం సరికాదని వివాద పరిష్కారానికి కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ విషయంలో సీఎం […]
Written By:
, Updated On : July 2, 2021 / 12:55 PM IST

కృష్ణా జలాల విషయంలో ఏపీకి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతులు జోడించి అడుగుతున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తికి అక్రమంగా నీటి వినియోగం సరికాదని వివాద పరిష్కారానికి కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు గుర్తుచేశారు. కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఈ విషయంలో సీఎం జగన్ ను విమర్శించడం సరికాదని రోజా అన్నారు.