
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలన్నారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకరాకు 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని, తక్షణం రూ. లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.