PoK protests : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికి పోతోంది. అంత్యరుద్ధం రీతీలో అక్కడి పరిస్థితులు అదుపుతప్పాయి. ఏదైతే కశ్మీరీలు మేము మతం పరంగా పాక్ లో చేరాలని చూశారా వాళ్లకు ఇది పెద్ద గుణపాఠం.. నిన్న ముజఫరాబాద్ లో ఆస్పత్రి దగ్గర నిరసనలు చేపట్టిన ఒక వ్యక్తిని చంపేస్తే
ఆయన అంతిమ యాత్ర జరిగే సమయంలో మళ్లీ సైన్యం జోక్యం చేసుకొని మరో 30 మంది ని చంపేశారని సమాచారం. పోలీసులు, సెక్యూరిటీ వాళ్లు ఏడుగురిని నిరసనకారులు చంపేశారట.. చనిపోయిన వారు , 450 మందిని నిర్బంధించారని సమాచారం.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ లో సపరేట్ ప్రభుత్వం ఉంటుంది. ముజఫరా ఒప్పందాన్ని అమలు చేయాలని జాక్ అనే కమిటీ నిరసనకారులు కోరుతున్నారు. 2025న చేసుకున్న ఒప్పందంలో కరెంట్ చార్జీలు తగ్గించాలి. మొత్తం పాకిస్తాన్ కు కరెంట్ మేమే సరఫరా చేస్తున్నా మాకు కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. సబ్సిడీ ధరకు గోధుమలు ఇవ్వాలి. మా దగ్గర నుంచే హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నుంచి కరెంట్ పోతున్నది మాకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఓకే అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇందులో ఒక విచిత్రమైన, వివాదాస్పదమైన నిబంధన ఉంది. మొత్తం స్థానాల్లో 12 సీట్లను 1947 దేశ విభజన సమయంలో పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడిన కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ శరణార్థులు పీఓకేలో కాకుండా పాకిస్థాన్లోని కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. వారు తాము నివసిస్తున్న నగరాల నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటూ పీఓకే అసెంబ్లీకి ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు. ఇదే ఇప్పుడు స్థానిక ప్రజల ఆగ్రహానికి కారణమైంది. మొత్తం ఇవీ పీవోకేను అగ్నిగుండంగా మరిచి నిరసనలకు కారణమైంది.
పాక్ ఆక్రమిత కాశ్మీరులో అంతర్యుద్ధ పరిస్థితులు.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.


