
సీఎం జగన్ పాలనలో ఏపీ ఆత్మహత్యల ప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని.. ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.