
ప్రధాని మోదీ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో క్వాడ్ నేతల సదస్సులో పాటు యూఎన్ జనరల్ అసెంబ్లీలోనూ మోదీ పాల్గొంటారు. ఈనెల 24న వాష్టింగ్టన్ లో మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యాషిహిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరగనుంది. ఆ తర్వాత ఈనెల 25న యూఎన్ సర్వసభ్య సమావేశం 76వ సెషన్ లో జరిగే జనరల్ డిబేట్ లో మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.