Kushaiguda Hanuman Statue: హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన 54 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఈ మహా విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దదిగా చెప్పుకుంటున్నారు. శ్రీరామ చరిత్రలో అభయం ప్రదర్శిస్తున్న అంజన్న రూపంలో ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. స్థానిక భక్తులు, దాతల సహకారంతో రూపొందించిన ఈ విగ్రహం విశేషాల గురించి వివరాల్లోకి వెళితే..
కుషాయిగూడలో 54 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహం శ్రీరాముడిని కాపాడిన అభయకరం రూపంలో దర్శనమిస్తుంది. సుమారు 16.5 మీటర్ల ఎత్తు ఉన్నాయి విగ్రహాన్ని 18 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్థానిక భక్త సంఘాలు, దాతలు, శ్రీరామ్ ట్రస్ట్ సహకారంతో రూ. 15 కోట్ల ఖర్చుతో ఈ మహా కార్యం సాకారమైంది. విగ్రహం ప్రత్యేకంగా తయారైన ఫైబర్ రెసిన్ మెటీరియల్తో నిర్మించారు. దీంతో భవిష్యత్తులో వర్షాలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినా.. తట్టుకునే శక్తి ఉంటుంది.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా లేజర్ లైటింగ్, ఫైర్వర్క్స్ భక్తులు ఉత్సాహంగా గడిపారు. ఈ ప్రాంతంలో. రంగురంగుల దీపాలతో అలంకరించడంతో ఆంజనేయ స్వామివారు విద్యుత్ దీపాల మధ్య మెరిసిపోయినట్లు కనిపించారు. భక్తులంతా కలిసి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం వల్ల ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేడుకల్లో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో హనుమాన్ జయంతి కూడా రాబోతుండడంతో చాలామంది హనుమాన్ దీక్ష పరులు ఇక్కడికి వచ్చి భజనలతో సందడి చేశారు. ఒకసారిగా ఈ ప్రాంతం మొత్తం కాషాయమయంగా మారిపోయింది.