బీబీ నగర్ ఎయిమ్స్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ లో అందుతున్న కోవిడ్ చికిత్స, వ్యాక్సిన్ ఇతర వైద్య సేవలకు సంబంధించిన వివరాలను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఇతర ఉన్నత వైద్య అధికారులను కిషన్ రెడ్డి అడిగా తెలుసుకున్నారు. ఆక్సిజన్ ఇతర సమస్యలపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ రమేష్ రెడ్డి, ఇతర అధికారులతో మాట్లాడారు. ఆక్సిజన్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర వైద్యరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కి ఫోన్ చేసి యుద్ద ప్రాతిపదికన వెంటిలేటర్స్ ఇతర సదుపాయాలు కల్పించాలని మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.