ప్రభుత్వంతో ముగిసిన జూడాల చర్చలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారి జరిపిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం నుంచి తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వలేదని జూడాలు తెలిపారు. సమ్మె విరమణపై ఈ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు వివరించారు. జూడాలతో ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వి చర్చలు జరిపారు.

Written By: Suresh, Updated On : May 27, 2021 2:38 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారి జరిపిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం నుంచి తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వలేదని జూడాలు తెలిపారు. సమ్మె విరమణపై ఈ సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఉత్తర్వుల జారీకి రెండు రోజుల సమయం పడుతుందని చెప్పినట్లు వివరించారు. జూడాలతో ప్రభుత్వం తరఫున వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వి చర్చలు జరిపారు.