
సెప్టెంబర్ లో యూఏఈకి ఎవరొచ్చినా రాకపోయినా ఐపీఎల్ 14 వ సీజన్ ను పూర్తి చేస్తామని రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్ తిరిగి నిర్వహించినప్పుడు విదేశీ ఆటగాళ్లు వస్తారా లేదా అనే విషయంపై చర్చలు జరిపాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన మ్యాచ్ లను పూర్తిచేయాలనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ఈ సీజన్ ను ఇలాగే మధ్యలో వదిలేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విదేశీ జట్టు ఆటగాళ్లు వచ్చి ఆడినా ఫర్వాలేదు. అలాగే ఎవరు అందుబాటులో లేకపోయానా మమ్మల్ని టోర్నీ నిర్వహించకుండా ఆపలేరు అని అన్నారు.