
పెగాసస్ హ్యాకింగ్ పై వచ్చిన ఆరోపణలను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నిఫుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలను కేంద్రం నిస్సందేహంగా తిరస్కరిస్తోంది. దానిపై వెలువడిన కథనాలు ఊహాజనితమైనవి. అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది అని కేంద్రం సుప్రీంకు వెల్లడించింది.