
కోవిడ్ -19 మెటీరియల్కు సంబంధించి తమ సమీకృత సప్లై చైన్ ద్వారా ఐక్యరాజ్య సమితి సహాయ పడేందుకు సిద్దమవగా భారత్ తిరస్కరించింది. దేశంలో లాజిస్టిక్స్ కు సంబంధించినంత వరకు బలమైన వ్యవస్థ ఉందని భారత్ సమాధానం చెప్పినట్టు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. భారత్ కు వీలైనంత సాయం చేసేందుకు యూఎన్ సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ చెప్పారు.