
తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఆకుల ఆగవ్వ అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 22న సీఎం మీటింగ్ పెట్టిన రోజు రాత్రే ఆగవ్వ ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి గురువారం ఆమెను వైద్యులు వాసాలమర్రికి తీసుకొచ్చారు. జూన్ 22 సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ తన దోస్త్ అని కేసీఆర్ అన్నారు.