Hyderabad Metro Expansion : హైదరాబాద్ మెట్రో 2003లో మొదట ఏర్పాటుకు నిర్ణయించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపాదించారు. తర్వాత ప్రభుత్వాలు మారడంతో అది పడకేసింది. తిరిగి 2012లో శంకుస్థాపన జరిగింది. 2014లో ప్రభుత్వం మారి రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హయాంలోనూ ఎలైన్ మెంట్ మార్చాలని ఆలస్యం చేశారు. 2017లో ప్రారంభమైంది. దేశంలో రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో కీర్తి సంపాదించింది. ఆరోజుకు ఇది దేశంలోనే రెండోది.
ఆ తర్వాత కేసీఆర్ 2023 డిసెంబర్ ఎన్నికలకు ముందు విస్తరణ పనులు మొదలుపెట్టింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు విస్తరించాలని నిర్ణయించారు. కేసీఆర్ దిగిపోయాక రేవంత్ రెడ్డి ప్రయారిటీ కేసీఆర్ కు దక్కవద్దని విస్తరణకు మోకాలడ్డేశారు.
ఎల్ అండ్ టీ నష్టాల్లో ఉందని తెలిసి తెలంగాణ ప్రభుత్వమే దాన్ని టేకప్ చేశారు. వాళ్లు కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ప్రకారం 22వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్ అండ్ టీకి 13.5 వేల కోట్లు ఇచ్చేసి ఎల్ అండ్ టీకి ఒప్పందం చేసుకున్నారు.
హైదరాబాద్ మెట్రో అంశంపై కేంద్రం తిరిగి కన్సల్టెంటుని ఎందుకు నియమించింది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

