
మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ చుట్టు పక్కల భూముల కొనుగోలు చేస్తే సేల్ డీడ్ చేయాల్సిందేనని.. కానీ 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు. గిఫ్ట్ డీడ్ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు. గండ్ల పోచంపల్లి గ్రామంలో 650 సర్వే నంబరులో ఉన్న భూమి 22 ఎకరాల 20 గుంటలు.. తాజాగా ధరణి వివరాల ప్రకారం 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇది ఏమైనా కేసీఆర్ నాటిన మొక్కా పెరిగి పెద్దది అవ్వడానికి అని విమర్శించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ లో వందల కోట్ల దుర్వినియోగం జరిగినట్లు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బయట పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.