
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడంతో ప్రభుత్వం విఫలమైందని తెేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ అమ్ముతున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.