GHMC division : జీహెచ్ఎంసీ.. ఇప్పుడు దాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించారు. జీవో కూడా రిలీజ్ చేశారు. పాత పేరుతో జీహెచ్ఎంసీ, అలాగేసైబరాబాద్, మల్కాజిగిరీ మున్సిపల్ కార్పొరేషన్.. జీహెచ్ఎంసీకి 6 జోన్లు, 30 సర్కిల్స్, అదే సైబరాబాద్ కు 3 జోన్లు 16 సర్కిల్క్, మల్కాజిగిరికి 3 జోన్లు, 14 సర్కిల్స్ గా విభజించారు.
అసలు ఈ విభజన అనేది ఫిబ్రవరిలో ఎలా చేస్తారు. రాజ్యాగబద్ద పోస్టు అయిన రిజిస్ట్రార్ సెన్సెస్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా వారు జనగణన చేపడుతున్నారు. కేంద్ర హోంశాఖ కింద జనగణన మొదలుపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ సరిహద్దులు మార్చాలన్నా.. జిల్లా, తాలూకా, గ్రామం, పట్టణాలు రెవెన్యూ, ఆడ్మినిస్ట్రేషన్ లు మార్చాలంటే 31 డిసెంబర్ 2025లోపే మార్చాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎటువంటి మార్పులు జనవరి 1 , 2026 నుంచి జనగణన పూర్తి అయ్యే వరకూ ఎటువంటి మార్పులు పరిగణలోకి తీసుకోమని కేంద్రం స్పష్టం చేసింది.
మరి ఎలా విభజించారన్నది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీ కూడా ఆపేసింది. కానీ తెలంగాణ ముందుకెళుతోంది..
జనగణన మార్గదర్శకాల ప్రకారం జిహెచ్ యంసి విభజన చట్టవిరుద్ధం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
