కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని వచ్చే దీపావళి పండుగ వరకు పొడిగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇవ్వనున్నుట్లు పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో పేదలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జాతినుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.