https://oktelugu.com/

కరోనా భయంతో కుటుంబం ఆత్మహత్య

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతున్నది. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు వెనుకాడకపోవడం ఆందోళన రెకెత్తిస్తున్నది. తాజాగా కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా లో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నల్లబెల్లి గ్రామనికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు కుమారుడు, కోడలుకు  నాలుగురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ గా […]

Written By: , Updated On : May 14, 2021 / 02:14 PM IST
Follow us on

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదానికి కారణమవుతున్నది. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు వెనుకాడకపోవడం ఆందోళన రెకెత్తిస్తున్నది. తాజాగా కొవిడ్ సోకిందన్న భయంతో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా లో కుటుంబ సభ్యులు మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నల్లబెల్లి గ్రామనికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు కుమారుడు, కోడలుకు  నాలుగురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.