గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన జూలై 30న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల […]

Written By: Suresh, Updated On : August 1, 2021 4:08 pm
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన జూలై 30న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.