
కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలంలో ఐదో రోజు ప్రజా దీవెన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ నాకు బంగారం పల్లెంలో పెట్టి పదవి ఇచ్చానా అంటున్నావు.. బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు భీ ఫామ్ ఇచ్చావు. గెలిచిందా కేసీఆర్ అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు బంగారు పల్లెంలో పెట్టి బీపాం ఇచ్చావు ఆయన గెలిచాడా అని అన్నారు. కేసీఆర్ ఓటుకు రూ. 10 వేలు ఇచ్చినా.. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.