ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి రోజని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అత్యవసర పరిస్థితి విధింపు, ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మన జాతిపై అనేక దుశ్చర్యలు చోటుచేసుకున్నాయని అన్నారు. జీవించే హక్కును కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అది అని అన్నారు. కాంగ్రెస్ నీతిమాలిన విధానాలకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిటికన్నా దేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.