
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ కు బదులుగా ఈఏపీ సెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా ఈఏపీ సెట్ ను నిర్వహించనున్నట్లు వివరించారు. నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేస్తామని 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.