
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసుల బాటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్ పొందాలని కోరింది. రాష్ట్రంలో క్లబ్ లు బార్లు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్ క్లబ్ లు, వాణిజ్య ప్రాంగణాలు, మాల్స్ ను మూసివేయాలని పేర్కొంది.