ధావన్ కెప్టెన్.. లంక షెడ్యూల్ ఖరారు

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే టీమ్ ఇండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడేందుకు శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత యువ బృందం అక్కడికి పయనం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించకపోయినా ఆ పర్యటన మ్యాచ్ లను ప్రసారం చేసే సోనీస్పోర్ట్స్ అధికారికంగా తమ ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. అందులో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా 21, 23, […]

Written By: Suresh, Updated On : June 7, 2021 9:30 pm
Follow us on

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే టీమ్ ఇండియా శ్రీలంక పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడేందుకు శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత యువ బృందం అక్కడికి పయనం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించకపోయినా ఆ పర్యటన మ్యాచ్ లను ప్రసారం చేసే సోనీస్పోర్ట్స్ అధికారికంగా తమ ట్వీటర్ ఖాతాలో వెల్లడించింది. అందులో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా 21, 23, 25 తేదీల్లో మూడు టీ20 లు జరుగుతాయి.