రెజ్లర్ సుశీల్ కుమార్ పై రూ. లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకొని తిరుగుతుండగా సుశీల్ ఆచూకీ చెబితే రూ. లక్ష అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ. 50 వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకోగా సాగర్ దండక్ అనే రెజ్లర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేయడంతోనే తీవ్ర […]
Written By:
, Updated On : May 18, 2021 / 09:25 AM IST

సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ రెజ్లర్ మృతి కేసులో తప్పించుకొని తిరుగుతుండగా సుశీల్ ఆచూకీ చెబితే రూ. లక్ష అతని అనుచరుడి గురించి సమచారం ఇస్తే రూ. 50 వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో ఘర్షణ చోటు చేసుకోగా సాగర్ దండక్ అనే రెజ్లర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేయడంతోనే తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేశారు.