
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,21,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 987 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,22,593కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏడుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,651 కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1.362 మంది కోలువడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,05,455కి చేరింది.