
ఏపీలో 24 గంటల వ్యవధిలో 88,149 పరీక్షలు నిర్వహించగా 2,498 కేసులు నిర్ధారణ కాగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,44,22 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,201 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.