Congress: 17న గజ్వేల్ లో కాంగ్రెస్ సభ

ఈనెల 17న గజ్వేల్ లో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటు పై ఇటీవల చర్చించిన టీపీసీసీ నేతలు.. ఈ మేరకు శనివారం తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి, చేవెళ్లోని రావిర్యాలలో ఈ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంట […]

Written By: Suresh, Updated On : September 4, 2021 5:36 pm
Follow us on

ఈనెల 17న గజ్వేల్ లో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ ఏర్పాటు పై ఇటీవల చర్చించిన టీపీసీసీ నేతలు.. ఈ మేరకు శనివారం తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లి, చేవెళ్లోని రావిర్యాలలో ఈ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంట నియోజకవర్గం పరిధిలో దండోరా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వెల్లడించారు.