దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 70 డెల్టా కేసులు నమోదైనట్లు స్పష్టంచేసింది. మహారాష్ట్రంలో 23, మధ్యప్రదేశ్ లో 11, తమిళనాడులో 10, తెలంగాణలో రెండు వేరియంట్లు వెలుగుచూసినట్లు తెలిపింది. డెల్టా వేరియంట్ ప్లస్ వైరస్ తో వెయ్యి రెట్లు ఎక్కవగా వైరల్ లోడ్ ఉంటుందని కేంద్రం అన్నిరాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.