
ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాల్లో భాగంగా ఈరోజు బాపట్ల పార్లమెంట్ జిల్లా సమావేశాన్ని చీరాలలో నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు కంచర్ల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సబ్యులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ సంస్థాగత విషయాలు, భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలపై చర్చించారు.