Chandrababu Naidu : కొందరి మాటలు విన్నప్పుడు అరే ఇన్నాళ్లు మనకు ఈ విషయం తెలియదే.. అనుకుంటాం. అదేంటి ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోతాం. అది తెలిసిన తర్వాత మనకు తెలియకుండానే చప్పట్లు కొట్టేస్తుంటాం. అటువంటిదే ఇప్పుడు జరిగింది. అది కాస్త ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టింది.
చంద్రబాబును చాలామంది సీఈవో అంటుంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కంటే.. ఒక రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే వ్యవహరిస్తూ ఉంటారు. ఎకనామిక్స్ బాగా చదువుకున్న ఆయనకు.. డబ్బు విలువ తెలుసు. అందువల్లే రాష్ట్రం బాగుండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు గొప్పగా ఉండాలని తపిస్తూ ఉంటారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బిల్ క్లింటన్ ను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వంటి కార్యాలయాన్ని హైదరాబాద్ వంటి నగరంలో ఏర్పాటు చేయించ గలిగారు. హైదరాబాద్ నగరానికి ఐటీని సరికొత్తగా పరిచయం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ దేశంలోనే రెండవ ఐటి నగరం గా పేరు తెచ్చుకున్నదంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేశాయి.
ఈ విషయాన్ని టిడిపి నేతలు చెబితే కొంతమంది తట్టుకోలేరు.. పైగా నాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ నగరంలో ఐటి పురుడు పోసుకుందని అంటుంటారు. ఇక గులాబీ పార్టీ నాయకుల కైతే చెప్పాల్సిన పనిలేదు. అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. ఆ చరిత్ర నిశితంగా పరిశీలించిన వారికి అది అర్థమవుతుంది.
చంద్రబాబు గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అది తక్కువే అవుతుంది. తాజాగా ఆయనలో ఉన్న మరో కోణాన్ని.. ప్రపంచానికి తెలియని అసలు వాస్తవాన్ని బయటపెట్టారు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ శ్రీ రెడ్డి కుమార్తె సంగీతారెడ్డి. ఈమె అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఓ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ప్రపంచానికి తెలియని విషయాలు చెప్పారు.
“ఒకప్పుడు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక వసతులు లేకుండా ఉండేది. దీనిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో బాగు చేశారు. దీనికోసం అపోలో ఆసుపత్రి సహకరించింది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అత్యధిక వసతులతో ఆసుపత్రి రూపురేఖలు మార్చేశారు. ఈ ప్రాజెక్టు ఈ స్థాయిలో విజయవంతం కావడం వెనుక కేవలం మేము మాత్రమే లేము. మమ్మల్ని చంద్రబాబు నిత్యం గైడ్ చేశారు. మాతో మాట్లాడారు. మార్పు వెనుక సలహాలు ఇచ్చారు. ఆయన అనుభవం చాలా గొప్పది. మాలో ఈ స్థాయిలో ఆయన ప్రేరణ కలిగించారు. ఇప్పుడే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. బిల్ క్లింటన్ వంటి వ్యక్తిని హైదరాబాద్ గడ్డమీద కాలు మోపేలా చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు విశాఖ నగరాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ జీవనాడిగా రూపాంతరం చెందిస్తున్నారు.. ఇంతకంటే గొప్ప విషయం ఏమంటుంది. ఇదంతా కూడా రిక్రియేషన్ లాగా కనిపిస్తోందని” సంగీతారెడ్డి వ్యాఖ్యానించారు.
కొందరు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతారు. ఇంకొందరు వ్యాపారాలు మాత్రమే మాట్లాడుతారు. కానీ చరిత్రను జాగ్రత్తగా పరిశీలించిన వారు.. వర్తమానాన్ని చూస్తున్నవారు నిజాలు మాత్రమే మాట్లాడతారు. సంగీత రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గురించి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఎప్పటిలాగానే వైసీపీ దీని మీద విమర్శలు చేస్తుంది. అడ్డగోలుగా మాట్లాడుతుంది. కానీ అసలు వాస్తవం ఏపీ ప్రజలకు తెలుసు.

