మరోసారి పెట్రోల్ ధరల పెంపు.. ఎంత పెరిగిందంటే?

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. శనివారం లీటర్ పెట్రోల్ పై 3 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11కు చేరగా డీజిల్ రూ. 88.65కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 104 దాటింది. డీజిల్ ధర రూ. 96.16కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ. 101.96కు పెరిగింది. మరో వైపు అత్యధికంగా రాజస్థాన్ […]

Written By: Suresh, Updated On : June 26, 2021 9:20 am
Follow us on

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. శనివారం లీటర్ పెట్రోల్ పై 3 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11కు చేరగా డీజిల్ రూ. 88.65కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 104 దాటింది. డీజిల్ ధర రూ. 96.16కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 102కు చేరువైంది. ప్రస్తుతం ధర రూ. 101.96కు పెరిగింది. మరో వైపు అత్యధికంగా రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో 109.30చేరగా డీజిల్ రూ. 101.85కు చేరింది.