https://oktelugu.com/

Bandi Sanjay: అమిత్ షా మాటల్లో తప్పేముంది?.. బండి సంజయ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్. టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదంటే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 18, 2021 / 03:32 PM IST
    Follow us on

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.  ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్. టీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదంటే అది మత తత్వమా?’’ అని ప్రశ్నించారు.

    1400 మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ది చేకూరేలా పాలన జరుగుతోందంటే అది మత తత్వం అవుతుందా? కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది. ఆ పార్టీ చేతిలో టీఆర్ఎస్ కీలు బొమ్మగా మారిందని అంటే మత తత్వమా?’’ అని నిలదీశారు.  నిజాం పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలను చెబితే అది మత తత్వం అవుతుందా? నిర్మల్ లో వెయ్యి మందిని ఒకే చెట్టుకు ఉరి తీశారంటే అది మత తత్వమా?’’అని ప్రశ్నించారు.  మత రిజర్వేషన్లకు బీజేపి వ్యతిరేకం, టీఆర్ఎస్ – మజ్లిస్ పార్టీలను ఓడించినప్పుడే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ లభించినట్లవుతుందని చెప్పిన మాటలు మత తత్వమా? ఏది మత తత్వం? ఎవరు మత తత్వ రాజకీయాలు చేస్తున్నారు?’’అని టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీజేబీ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని బండి సంజయ్ ఈ సందర్భంగా అన్నారు.