AFghanistan: ఆ భారతీయులంతా సురక్షితమే

అఫ్గానిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా తీవ్ర ఆందోలన కలిగించాయి. అయితే వారిని ప్రశ్నించి, విడుదల చేసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాబుల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న 150 మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు ఉదయం స్థానిక మీడియాతో వార్తలు వచ్చాయి. వెంటనే భారత్ విదేశాంగ శాఖ అప్రమత్తమై […]

Written By: Suresh, Updated On : August 21, 2021 3:22 pm

Talibans

Follow us on

అఫ్గానిస్థాన్ నుంచి భారత్ వచ్చేందుకు కాబుల్ విమానాశ్రయం వచ్చిన భారతీయుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేశారనే వార్తలు ఒక్కసారిగా తీవ్ర ఆందోలన కలిగించాయి. అయితే వారిని ప్రశ్నించి, విడుదల చేసినట్లు తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాబుల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న 150 మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు ఈ రోజు ఉదయం స్థానిక మీడియాతో వార్తలు వచ్చాయి. వెంటనే భారత్ విదేశాంగ శాఖ అప్రమత్తమై సంప్రదింపులు చేపట్టింది. కాగా ప్రయాణికుల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించేందుకే వారిని తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలో వారిని భారత్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.