కరోనాకు 513 మంది వైద్యులు బలి

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగం పై తీవ్ర  ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు సుమారు 513మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ఇందులో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే 103 మంది వైద్యులు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత బిహార్ 96 మంది, ఉత్తరప్రదేశ్ లో 41 మంది, రాజస్థాన్ లో 39 మంది, ఆంధ్రప్రదేశ్ లో 29 మంది, తెలంగాణలో 29 మంది […]

Written By: Velishala Suresh, Updated On : May 26, 2021 8:58 am
Follow us on

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగం పై తీవ్ర  ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు సుమారు 513మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. ఇందులో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలోనే 103 మంది వైద్యులు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత బిహార్ 96 మంది, ఉత్తరప్రదేశ్ లో 41 మంది, రాజస్థాన్ లో 39 మంది, ఆంధ్రప్రదేశ్ లో 29 మంది, తెలంగాణలో 29 మంది వైద్యులు మరణించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా మృతి చెందారని పేర్కొన్నారు.