
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఇవాళ కొత్తగా 3,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మరణించారు. 4,976 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,946 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇవాళ 71,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 594 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 265 కేసులు నమోదు అయ్యాయి.