
కరోనా మహమ్మారిపై పోరాటానికి టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సాయం చేసేందుకు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ దంపతులు రూ. 2 కోట్ల విరాళం ప్రకటించారు. కెంటో ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజల నుంచి దాదాపు రూ. 7 కోట్లు సేకరించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోపే రూ. 3.6కోట్లు నిధులు వచ్చాయి. దేశానికి సాయం చేయడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటాం థాంక్స్ అంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు.