
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతునే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. పాజిటివ్ కేసులు కాస్త తగ్గినా మరణాలు మరోసారి నాలుగు వేలకు పైగా నమోదయ్యాయి. ఒకే రోజు 4,007 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు వైరస్ నుంచి బాధితులు భారీగా కోలుకున్నారు. 24 గంటల్లో 3,62,437 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరగా ఇప్పటి వరకు 2,07,95,335 మంది కోలుకున్నారు.