తెలంగాణలో కరోనా కేసులు పైపైకి పోతున్నాయి. రోజుకు 2వేలకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. బుధవారం విడుదల చేసిన హెల్త్బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,77,070 కాగా మరణాల సంఖ్య 1062గా నమోదైంది. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 82.52 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 2,062 మంది కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 29,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబద్లో పరిధిలో 321 కేసులు నమోదు కాగా రెండో స్థానంలో రంగారెడ్డిలో 217 మందికి వ్యాధి నిర్దారణ అయింది.
ALso Read: కేటీఆర్ సీఎం కావడం కల్ల.!?