
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్ లో ప్రవేశానికి గడువును ఈనెల 31 వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురువారం పొడిగించింది. ఈ సందర్భంగా ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించాలని బోర్టు కార్యదర్శి జలీల్ ఆదేశించారు. కొన్ని కాలేజీలు అనుమతి లేకుండా ప్రేవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.