విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు ఆపగలరని తెలిపారు. ఈ వ్యవహారంపై వెంకయ్యనాయుడు నోరు తెరవాలని ఆపే శక్తి ఆయనకు ఉందని అన్నారు. తాము ఢిల్లీలో ధర్నాకు ప్రయత్నం చేసాము కానీ విజయసాయి రెడ్డి వల్ల జరగలేదని చెప్పారు. మోదీ కాళ్లపై పడే విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.