వైభవంగా దుర్గమ్మకు ఆషాఢ సారె

ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉదయం ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాదర్మ, ఆలయ సిబ్బంది అమ్మవారికి మొదటిసారె సమర్పించారు. మేళతాలాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారికి కంఠాభరణాన్ని సమర్పించారు. ఆగస్టు 8 వరకు ఆషాఢ సారె కార్యక్రమం జరుగుతుందని ఛైర్మన్ తెలిపారు.

Written By: Suresh, Updated On : July 11, 2021 11:03 am
Follow us on

ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉదయం ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాదర్మ, ఆలయ సిబ్బంది అమ్మవారికి మొదటిసారె సమర్పించారు. మేళతాలాల మధ్య పవిత్ర సారెతో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది అమ్మవారికి కంఠాభరణాన్ని సమర్పించారు. ఆగస్టు 8 వరకు ఆషాఢ సారె కార్యక్రమం జరుగుతుందని ఛైర్మన్ తెలిపారు.