ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢీల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఆయన ఢీల్లీ నుంచి నేరుగా తిరుపతికి బయల్దేరారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గోననున్నారు. రెండుు రోజులపాటు తిరుమలలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు డీల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.00 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.27 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అన్నమయ్య భవన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడితో జరిగే వీడియో కాన్పరెన్స్ లో పాల్గోంటారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.